యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

Spread the love

సాక్షిత : రాష్ట్రంలో తిరిగి కెసిఆర్ ప్రభుత్వం

దేశంలో ఈ సారి బి ర్ స్ సర్కార్

బి ర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి

బి ర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించాలి అన్నారు. మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని కోరారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతున్న మంత్రి కేటీఆర్ బంగారు తెలంగాణ ధ్యేయంగా నిరంతరం ప్రజల మనసులను దోచిన మహోన్నతమైన ప్రజానాయకుడిగా వెలుగుతూ కెసిఆర్ చూపిన బాటలో మరెన్నో ఉన్నత శిఖరాలు చేరాలని భగవంతుని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో, దేశంలో brs ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూడా ఆకాంక్షించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం, దేశం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని చెప్పారు.

Related Posts

You cannot copy content of this page