పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

Spread the love


Minister Errabelli paid tributes on the occasion of PV Narasimha Rao’s death

పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

గొప్ప నిజాయితీ గల నాయకుడు పివికి నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను

దేశ ప్రధానిగా గొప్ప సేవలు అందించి, దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకులు పూర్వ ప్రధాని పివి నరసింహారావు అన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పి.వి నరసింహ రావు వర్ధంతి సందర్భంగా నేడు హనుమకొండ జిల్లాలోని పివీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

పివీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా ముందుకెళ్లిందనీ, చాలా నిజాయితీగా పనిచేసిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.

ఇంతటి గొప్ప వ్యక్తి వరంగల్ బిడ్డ కావడం, తెలంగాణ వాడు కావడం, తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు.

ప్రధానిగా ఎలా ఉండాలి? ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి? అని నిరూపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు అన్నారు.

అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.

Related Posts

You cannot copy content of this page