ప్రతీ కుటుంబానికి అండగా ఉంటా : ఎంజీఆర్

Spread the love

భావితరాల భవిష్యత్తు బాగు కోసం కృషి చేస్తా : ఎంజీఆర్

సామాన్యుడు శాసనసభ్యుడు అయితేనే నియోజవర్గం అభివృద్ధి : గురండి గ్రామస్థులు

పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం గురండి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బొర ధనుంజయ, పతివాడ రమేష్ మరియు జనసేన నాయకులు జయరాజ్,అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్థులతో ఆత్మీయ కలియిక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు(ఎంజీఆర్) పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భముగా ఎంజీఆర్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తకు కూడా అండగా ఉంటూ,భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేస్తానని,గ్రామస్థులకు ఎటువంటి అవసరం వచ్చిన కుటుంబ సభ్యుడిగా ఉంటానని తెలియజేస్తూ,నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వారసత్వ,వలస నాయకత్వన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ ప్రజా సేవకుడైన ఎంజీఆర్ తో మా ప్రయాణమని,రానున్న ఎన్నికల్లో ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇదివరకే ఎంతోమంది నాయకులు చేతుల్లో నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎటువంటి అభివృద్ధి జరగలేదని వారు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ముండేటి వెంకటరమణ, నడిమింటి బడ్డు,వినోద్,అనిల్,బర్ల లక్ష్మణ రావు,గులివిందల కుర్మయ్య,బోరాడ చిన్నారావు,సిరిమి శ్రీరాములు,గవర తిరుపతిరావు,బోర శ్రీరామమూర్తి తో పాటు కొత్తూరు టిడిపి మాజీ మండల అధ్యక్షులు, మండల నాయకులు, ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 20 At 11.34.02 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page