నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి

Spread the love

నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యువతి యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే స్థిరమైన ఆలోచనలు, కృషి, పట్టుదల, దీక్ష తో ముందుకు వెళ్లి కష్టపడి తమ లక్ష్య స్థానాలకు చేరుకోవాలని తన వ్యక్తిగత జీవిత గమ్య స్థానాలను చేరుకున్న విధానాన్ని యువతి యువకులకు తెలియజేసి వారిలో ఆత్మస్థైర్యం నెలకొల్పారు.

ఈ యొక్క కార్యక్రమంలో నేరేడ్ మేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మీనా ఉపేందర్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ.ఆర్ విజయ రావు, నెహ్రూ యువ కేంద్ర రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యేసయ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువత క్రీడల అధికారి బలరాం రావు, ఆర్గనైజర్లు చిందం శ్రీనివాస్, నంద ప్రసాద్, మల్కాజ్గిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్, శైలజ వైస్ ప్రిన్సిపల్ లక్ష్మయ్య, బిఆర్ఎస్ నాయకులు రావుల అంజయ్య , ఉపేందర్ రెడ్డి, జి .కే .హనుమంతరావు, ఢిల్లీ పరమేష్, మధుసూదన్ రెడ్డి, మహిళలు శోభ ,రమాదేవి ,ప్రమీల, యువకులు నర్సింగ్ రావు, రెబ్బ వాసు, రోహిత్ , సాయి, మౌలా, బాలరాజు,
యువతి, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page