గ్రామీణ రోడ్లకు మహర్దశఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

Mahardasa MLA Goodem Mahipal Reddy for Rural Roads

గ్రామీణ రోడ్లకు మహర్దశ
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


సాక్షిత పటాన్చెరు : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని..పాటి, ఘనపూర్, కర్ధనూర్, నందిగామ, భానురు, రుద్రారం, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, లక్డరం గ్రామాల పరిధిలో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రణాళికబద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు.

ఘనాపూర్ గ్రామం విశాఖ ఇండస్ట్రీస్ వరకు 2 కోట్ల 25 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page