వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాధర్నా,,,, కొండిశెట్టి వెంకటరమణరయ్య

Spread the love

పామూరు సాక్షిత న్యూస్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఆదేశానుసారం ప్రకాశం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం నందు ఈనెల 10వ తేదీన మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని బిజెపి కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ కొండిశెట్టి వెంకటరమణయ్య ఓక ప్రకటనలో తెలిపారు.

గ్రామ స్వరాజ్యమే ధ్యేయం అనే మహాత్మా గాంధీ ఆశయాన్ని నరేంద్ర మోడీ గ్రామ సర్పంచులకే పూర్తి అధికారాలు ఇస్తూ నిధులను సర్పంచుల ఖాతాలో జమ చేయాలనే ఆశయంతో అమలు చేస్తుంటే, ఆ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు విడుదల చేసిన నిధులను వైసీపీ ప్రభుత్వం సుమారు 1000 కోట్ల రూపాయలను దారి మళ్ళించారని, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు చేసిన వారికి బిల్లులు రానికుండా వారి కుటుంబాలు నడీ రోడ్డు మీద పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయని ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 10వ తేదీన మహాధర్న కార్యక్రమం నిర్వహిస్తామని కొండిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు జాజం చిన్న సుబ్బయ్య, ఇండ్ల వెంకట సత్యం, దేవి శెట్టి పవన్ కుమార్, పాడే అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page