లోపెంట నూతన గ్రామ సచివాలయం భవనంను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

Spread the love

లోపెంట నూతన గ్రామ సచివాలయం భవనంను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లోపెంట గ్రామ నూతన గ్రామ సచివాలయంను భవనంను MGNREGS నిధులతో 25లక్షలు వ్యయంతో నూతనభవనం ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలోభాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రతి సచివాలయానికి,కోటి రూపాయల నిధులతో సచివాలయ భవనాలు,రైతు భరోసా కేంద్రాలు,హెల్త్ సెంటర్లు నిర్మాణం చేసి12 మంది గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను,50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని ఏర్పాటు చేసి పేద ప్రజల బాగోగులకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా మీ అండదండలు అందించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో లోపెంట పంచాయతీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరు నాగార్జున రెడ్డి,అలుపన మల్లేశ్వరరెడ్డి,అలుపన కోదండరామిరెడ్డి,జీరు సూర్యనారాయణరెడ్డి పార్టీ శ్రేణులు, పాల్గున్నారు.

Related Posts

You cannot copy content of this page