తమ్ముడి కోసం అన్న ఆరాటం

Spread the love

అమ్మ అనారోగ్యంతో ఉంది ఎక్కడున్నా తిరిగి రా తమ్ముడు
— విలేకరుల సమావేశంలో ఎర్రలింగం వెంకటసుబ్బయ్య

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. నీకోసం ఎదురు చూస్తుంది. ఎక్కడున్నా తిరిగి ఇంటికి రావాలని తన తమ్ముడు ఎర్రలింగం నాగేశ్వరావు (నాగేష్)ను అన్న ఎర్రలింగం వెంకటసుబ్బయ్య ప్రాధేయపడ్డాడు.

ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎర్రలింగం వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. తమది కడప జిల్లా, పొద్దుటూరు గ్రామమని తన తమ్ముడు ఎర్రలింగం నాగేశ్వరరావు (35), గత పది సం.ల క్రితం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉంటూ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలతో ఉండేవాడని, అనంతరం తన భార్య అనారోగ్యంతో మృతి చెందిందని, ఖమ్మం పరిసర ప్రాంతాల్లోనే తన కూతుర్లు కీర్తన(15) మేఘన(13)లతో కలిసి నివసిస్తున్నాడని తెలిపాడు. గత కొంతకాలంగా తన తమ్ముడు కుటుంబానికి చెందిన ఆచూకీ తెలియడం లేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని, తమ ఊరికి రావడం లేదని వీరి ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయిందని తన తల్లి నాగసుబ్బమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉందని, అమ్మను చూసేందుకైనా తన పిల్లలతో తమ్ముడు నాగేష్ ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడ్డాడు. వీరి ఆచూకీ ఎవరికైనా తెలిసిన వెంటనే 9502449283, 9704341838 లకు ఫోన్ సమాచారం ఇవ్వాలని కోరాడు విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి నరసింహులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page