కురుమ కులం కి న్యాయం కోసం దేశ ప్రధాని మోడీ కి మోడీ యాప్ ద్వారా లేఖ

Spread the love

Letter to Prime Minister Modi for Justice for Kuruma Caste through Modi App

సాక్షిత : (కురుమ కులం కి న్యాయం కోసం దేశ ప్రధాని మోడీ కి మోడీ యాప్ ద్వారా లేఖ)
భారత ప్రధాని మోడీ కి బీజేపీ రంగరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రాచూరి రాజశేఖర్ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ లో దేశం లో కురుమ కులం గల వారు కురుమ, కురువ, కురుబ, కుర్మి, ఇలా అనేక పేర్ల తో దేశ వ్యాప్తంగా నివసిస్తున్నారు, వృత్తి పరంగ కొండల పంటి, అడువుల పంటి తిరిగి గొర్రెల పెంపకం చేస్తు జీవనం సాగిస్తున్నారు,

విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వెనుకబడి అభివృద్ధి కి అందనంత దూరం లో ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రం లో ఒక్కొక్క రకంగ వేరు వేరు సామాజిక వర్గాలలో ఉన్నారు. ఎంతో తెలివి, నైపుణ్యం గల కులం కురుమలది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో చాలా వెనుక బడి ఉన్నారు.

ఈ కులాన్ని దేశవ్యాప్తంగా ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే పేరు తో గుర్తించి, జీవనం కోసం జీవాలు, కొండలు, అడవుల మీద ఆధారపడి ఉన్నాం, కాబట్టి షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గం లో చేర్చి కురుమ జాతి పై చొరవ తీసుకొని ఆదుకోవాలని అని మనవి.
ఇట్లు
రాచూరి రాజశేఖర్

Related Posts

You cannot copy content of this page