మంచిర్యాల జోన్ నూతన డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన కేకన్ సుదీర్ రాంనాథ్ .

Spread the love

Kekan Sudhir Ramnath has taken charge as the new DCP of Manchiryala zone

రామగుండం పోలీస్ కమిషనరేట్
మంచిర్యాల జోన్ నూతన డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన కేకన్ సుదీర్ రాంనాథ్ .


సాక్షిత : మంచిర్యాల జోన్ నూతన డీసీపీ గా కేకన్ సుధీర్ రాంనాథ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మంచిర్యాల జోన్ కు చెందిన పోలీస్ అధికారులు డీసీపీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఈ సంద్భంగా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు ప్రజల అందరి సపోర్టు అవసరం అని అన్నారు. నేరాలు జరుగకుండా తగు చర్యలు తీసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని అందుకు ప్రజల సపోర్టు ఉండాలనీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కొనసాగిస్తామని, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తించదని డీసీపీ అన్నారు.


నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనరు కల్సి పుష్పాగుచ్చాలను అందజేసిన వారిలో బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, జైపూర్ ఏసీపీ నరేందర్ లు,మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ లు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page