కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

Spread the love

*మొల్ల విగ్రహానికి పూలమాలు వేసి అంజలి ఘటించిన నగర మేయర్ డాక్టర్ శిరీష*

కవయిత్రి మొల్లమాంబ (మొల్ల) జయంతిని ఉదయం బీసీలు ఘనంగా జరుపుకున్నారు.

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మహతి ఆడిటోరియం సమీపంలో వున్న మొల్ల విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) జయంతిని అధికారికంగా ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల జారీ చేసిందని తెలియజేశారు. ప్రతిభకు ఏది అడ్డు కాదని కొనియాడారు.

తిరుపతిలో జరిగిన మొల్ల జయంతి వేడుకలు ఘనంగా జరిగింది అని అలాగే గతంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అదృష్టమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బి.వి.కేశవులు, సాహితీ వేత్త సాకం నాగరాజు, అంజయ్య,లక్ష్మయ్య యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య, జమున, సాకం ప్రభాకర్, గోపాల్, అశోక్ సామ్రాట్ యాదవ్,రమణ, వెంకటరమణ, నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page