సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కళావెంకటరావు

Spread the love

సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కళావెంకటరావు

సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగిస్తుంది.చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు తెలిపారు.రామతీర్థం జంక్షన్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.దన్నానపేట నుంచి రావివలస జంక్షన్‌ మీదుగా రణస్థలం జంక్షన్‌ వరకు కళావెంకటరావు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ…లోకేష్‌బాబు యువగళం పాదయాత్ర చూసి జగన్మోహన్‌రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోంది. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు. స్థానిక బీరు పరిశ్రమ యాజమాన్యానికి భయపెట్టి.. కార్మికులకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం లేదు. మరోవైపు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు కూడా అందడం లేదు. ఇటువంటి దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, నాలుగు మండలాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page