ఏపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై జనసేన ముందడుగు

Spread the love

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన ముందడుగు వేయనుంది. డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకటవ తేది మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొననున్నారు. పార్టీ పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షుడు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన – టీడీపీ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు పరిశీలన తదితర విషయాలపై చర్చ జరగనుంది..

Whatsapp Image 2023 11 29 At 12.16.48 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page