SAKSHITHA NEWS

సాక్షిత : అభివృధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో తీర్చి దిద్దుతున్నామని , దళారీ వ్యవస్థను పూర్తిగా నివారించమని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో తార్నాక డివిజన్ లో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం లో ఉప సభాపతి పద్మారావు గౌడ్ పింఛన్ల గుర్తుపు కార్డులు పంపిణి చేశారు. అనంతరం బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్సాపొరేట ర్ శ్రీమతి కంది శైలజతో బౌద్దనగర్ డివిజన్ కమ్యూనిటీ హాల్ లో బౌద్దనగర్ డివిజన్ కు చెందిన లబ్దిదారులకు ఆసరా పించన్ల గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గతంలో సుమారుగా 16 వేల మందికి ఆసరా పించన్లు అందించమని, కొత్తగా మరో ఆరు వేల మందికి ప్రస్తుత విడతలో పించన్లు మంజురయ్యయని తెలిపారు. అర్పింహులందరికీ పించన్చలు అందిస్తామని తెలిపారు. ఎం ఆర్ ఓ లు శ్రీమతి మాధవి, అయ్యప్ప,, స్థానిక ప్రముఖులతో పాటు కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి. కంది నారాయణ, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఒక్కో లబ్దిదారుని వివరాలను ఆర తీస్తూ గుర్తింపు కార్డులను అందించారు


SAKSHITHA NEWS