కేసిఆర్…. దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ

Spread the love

కేసిఆర్…. దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


సాక్షితచండూరు: మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా అంటే విప్లవాల ఖిల్లా అని చెప్పారు. తమను దొంగదెబ్బ తీసేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలో నామినేషన్‌ వేసేందుకు పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు, నేతలతో రాజగోపాల్‌రెడ్డి వెళ్లారు. నామినేషన్‌ వేసిన అనంతరం చండూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

Related Posts

You cannot copy content of this page