హాథ్ సే హాత్ జోడో కార్యక్రమం మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ జగదీశ్వర్ రావు ,

Spread the love

సాక్షిత : ఏ‌ఐ‌సి‌సి కార్యదర్శి బోసు రాజు మరియు టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మెదక్ నియోజకవర్గంలో హాథ్ సే హాత్ జోడో కార్యక్రమం మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ జగదీశ్వర్ రావు ,మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి తో కలిసి ప్రారంభించిన మెదక్ నియోజకవర్గ హాథ్ సే హాత్ జోడో అభియాన్ ఇంచార్జ్,టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు మండల స్థాయి నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికీ వెళ్ళి రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర సందేశాన్ని పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర స్పూర్తితో రాష్ట్రమంతటా ఇంటింటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వెళ్ళి యాత్ర సందేశాన్ని చేరవేసి,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రజలకు వివరించి,కేంద్రంలో,అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు వల్ల జరిగే ప్రయోజనాన్ని వివరించి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page