ప్రజా సంక్షేమానికి నిత్యం పాటుపడే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలి: డివిజన్ కార్పొరేటర్లు…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో…

127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ నాయకులతో కలిసి ముమ్మర ప్రకారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలు అన్ని బంద్ అయ్యాయని, సంక్షేమ పథకాలను తిరిగి పునః ప్రారంభించాలంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతో కొట్లాడే నాయకుడిని గెలిపించాలి.

129 – సూరారం కాలనీ డివిజన్ లో…

129 – సూరారం డివిజన్ పరిధిలలో హేమలత సురేష్ రెడ్డి పలు కాలనీలలో కలియ తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, గడిచిన నాలుగు నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలన్నారు.

131- కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి లో…

కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ కూన గౌరీష్ పారిజాతం ఎన్నికల ప్రచారం నిర్వహించి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న మోసాన్ని గత పదేళ్ళ కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ఎన్ని ప్రజలకు వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page