ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Spread the love

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలము నేరడ గ్రామంలో 2003-04 బ్యాచ్ కు సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నాడు నేరడ జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో హట్టహాసంగా నిర్వహించడం జరిగింది. తమ గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది. చిన్ననాటి స్నేహితులు అందరూ ఒకే వేదికపై కలిసి వారి పాత జ్ఞాపకాలను మధుర స్మూతులను గుర్తు చేసుకోవడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ఈరోజు మేము అందరం ఒకే వేదికపై దాదాపు 19 సంవత్సరాల తర్వాత కలవడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. మాకు అక్షరాలు నేర్పిన గురువులను ఇక్కడ సన్మానించుకోవడం అలాగే మా మిత్రులతో వారి యోగక్షేమాలు తెలుసుకోవడం రోజంతా అహల్లాదకర వాతావరణం లో గడపడం జరిగింది అని తెలిపారు. అనంతరము పాఠశాలకు 18 వేల రూపాయల ప్రింటింగ్ మిషన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, రాజు, ప్రదీప్, శ్రీను, రమేష్, మహేష్, లావణ్య, రాజేశ్వరి, అనురాధ,సరిత,విమల, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page