ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి

Spread the love

ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి ..

ఉత్తరాంధ్రలోని అన్నదాతల అగచాట్లు ను ప్రభుత్వం విని అధికారులు వెంటనే స్పందించి
రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చం నాయుడు డిమాండ్ చేశారు. నందిగాం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మంత్రులు ఏపీ సీఎం కు ఎంత ప్రదేయపడిన ఫలితం లేదన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు.రైతుల సమస్యలు తీర్చలేని అధికారులు, మంత్రులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.జగన్ ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిపోనుందని ఆయన విమర్శించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page