పాల్వంచలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Spread the love

Former MP Ponguleti’s visit to Palvancha

పాల్వంచలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్వంచ మండలంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని కిన్నెరసాని, రాజాపురం, పూసలతండా, కోడిపుంజులవాగు, సూర్యాతండా, దేవుజ్యా తండా, తోగ్గూడెం తండా, తోగ్గూడెం, జగన్నాథపురం, నాగారం కాలనీ, రంగాపురం,

కేశవాపురం, సీతానగర్ కాలనీ, బస్వతారక కాలనీ, వీరూనాయక్ తండాలను సందర్శించారు. ఇటీవల మృతిచెందిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన పలువురిని పరామర్శించి ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు.

ఆర్థిక సాయాలను కూడా అందజేశారు. ఆపదలో అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల వివాహం చేసుకున్న నూతన జంటలను ఆశీర్వదించి, పట్టువస్త్రాలను కానుకగా అందించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.

ఈ పర్యటనలో పొంగులేటి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, తెరాస రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎం.డీ. రజాక్, జాలె జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, ఇజ్జగాని రవిగౌడ్, చింతా నాగరాజు,

ఆవుల మధు, తుమ్మల శివారెడ్డి, కొంగర అప్పారావు, తాళ్ళూరి షణ్ముఖ చారి, తాండ్ర నాగబాబు, దేవరగట్ల ప్రసాద్, సర్పంచులు కోరెం అర్జున్ రావు , సాధునాయక్, ఎంపీటీసీ అజ్మీరా నేజీ, ఉపసర్పంచ్ అప్పారావు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page