వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love


Former MLA Kuna Srisailam Goud met Zonal Commissioner to grant interest free loans

వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మహిళా మోర్చా నాయకులు


సాక్షిత : రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇవ్వకుండా, డ్వాక్రా గ్రూపు మహిళల వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారిని వేధిస్తోందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పలువురు మహిళా మోర్చా నాయకులతో కలిసి కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ మమత ని కలిసి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపు మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలనీ వినతి పత్రం అందచేశారు.

కుత్బుల్లాపూర్ లోని రెండు జంట సర్కిళ్ల లో 4800 డ్వాక్రా గ్రూపులు ఉండగా, వడ్డీ లేని రుణాలు ఇవ్వని కారణంగా 1300 గ్రూపులు కనుమరుగు అయ్యాయని అన్నారు. ఎమ్మెల్యే చేతకానితనం ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు.వడ్డీలేని రుణాలు మంజురూ చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల సుధా, మహిళా మోర్చా నాయకులు అరుణ రెడ్డి, అలివేలు, పూలమ్మ, వసుంధర, రాజమ్మ, గీత, నాయకులు తల్లాప్రగడ మహేష్, బుచ్చి రెడ్డి, గరిగె శేఖర్, జగన్ మోహన్ రావ్, కంది శ్రీరాములు, గుబ్బల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page