బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ.

Spread the love

నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందజేశారు.

జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం నందు గత రాత్రి జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన గాదే సురేష్ కుమార్తె కు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి వారి కుమార్తెకు వైద్య ఖర్చుల నిమిత్తం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయడం జరిగింది. ఆ చెక్కును గత రాత్రి జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారునికి ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందించడం జరిగింది.

అదేవిధంగా జగ్గయ్యపేట పట్టణం సీతారామపురం యాదవ్ బజార్ కు చెందిన భయ్యా లింగ బాబు కుమార్తెలైన భయ్యా సుప్రియ,భయ్యా హరిప్రియ వీరిద్దరికీ పుట్టుకతో చెవుడు కారణంగా కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా ఆ ఇద్దరు పిల్లలకు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 2 లక్షల 60 వేల రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలకు 5 లక్షల 20వేల రూపాయల మంజూరు పత్రాన్ని ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను లబ్ధిదారునికి అందించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page