ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

Spread the love

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ స్థానిక శాసనసభ్యుడు ముటా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతామని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాలకు సీనియర్ అధికారుల బృందాలను పంపి ఈ వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, స్థానిక సమస్యలను పరిష్కరించుకొనేందుకు అధికారుల చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పేలా వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని పద్మారావు గౌడ్ తెలిపారు.

అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
అన్ని మునిసిపల్ డివిజన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశాము, ఇతర వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా వార్డులకు పంపేలా కుడా ఏర్పాట్లు జరుపుతాము. ఈ వార్డు కార్యాలయాలను ప్రజలు సదివినియోగం చేసుకోవా లని, అన్ని మునిసిపల్ డివిజన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని, ఇతర వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా వార్డులకు పంపేలా కుడా ఏర్పాట్లు జరుపుతామని పేర్కొన్నారు. రాజకీయాలు, జండాలను పక్కకు పెట్టి పేద ప్రజల సంక్షేమానికి కలిసి రావాలని ఆయన కోరారు.

Related Posts

You cannot copy content of this page