SAKSHITHA NEWS

Crowd flocked to Minister Kakani’s program during his visit to Prabhagiripatnam

ప్రభగిరిపట్నం పర్యటనలో మంత్రి కాకాణి కార్యక్రమానికి పోటెత్తిన జనం”


సాక్షిత : కాకాణి వెంట అప్యాయంగా గ్రామమంతా పర్యటించిన స్థానిక ప్రజలు.
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు “ఒక్క రూపాయి మంజూరు చేయించలేకపోయిన సోమిరెడ్డి” పనిగొట్టుకొని విమర్శలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.*
సోమిరెడ్డి హయాంలో శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప, ప్రారంభోత్సవ శిలాఫలకాలు లేవన్నారు.


సోమిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిధులు కేటాయించలేక పోయాడన్నారు*
ప్రభగిరిపట్నం గ్రామంలో నేను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడానికి కారణం.. , సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, ప్రభగిరిపట్నం సచివాలయ పరిధిలో ఉలవరపల్లి, ప్రభగిరిపట్నం గ్రామాల్లో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .


గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి, ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ, ప్రభుత్వ ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీయడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవడమే అజెండాగా “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసిన మంత్రి కాకాణి.*
రైతులకు సమగ్రంగా సాగునీరు అందించడంతో పాటు, ఎరువుల కొరత రానివ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. తుఫానులు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువలను, చెరువులను యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి, రైతాంగానికి సాగునీరు అందించాం.
రైతులకు సాగునీరు రైతు భరోసా, ఆ సీజన్ ముగిసే సరికి ఇన్ పుట్ సబ్సిడీ, వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీలో విత్తనాలు అందించాం.

నేడు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకొని లాభపడుతున్నారు.
తెలుగుదేశం నాయకులు రైతులు బాగుపడుతున్నారని కుమిలి, కుమిలి ఏడుస్తున్నారు.
గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టిన సోమిరెడ్డి, మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, రైతుల నడ్డి విరిచిన సంగతిని రైతులు ఎన్నటికీ మర్చిపోరు.


చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారు.
“రైతులు బాగుంటే రాష్ట్రం బాగుపడుతుందన్న” ఆలోచన చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
పాలిచ్చేటువంటి పాడి బర్రెను వదులుకొని, మేతమేసే దున్నపోతును తెచ్చుకొని ఇంట్లో కట్టేసుకునే మూర్ఖులు ఎవరు ఉండరని తెలుగుదేశం నాయకులు తెలుసుకుంటే మంచిది.
రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు.
ఈనాడు పత్రిక రాసే రాతలు చూస్తే పత్రికలకు విలువ లేకుండా పోతుంది.
రామోజీరావు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో, పిచ్చి, పిచ్చి రాతలు రాస్తున్నాడు.

గతంలో పట్టాభి పై జరిగినటువంటి దాడికి సంబంధించిన ఫోటోలను నేడు జరిగినట్లు ప్రచురించి, కథనాలు రాసి ఈనాడు పత్రిక అబాసుపాలయ్యింది.
వైసీపీ సోషల్ మీడియా రామోజీరావు బాగోతాన్ని పట్టబయలు చేసింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా పనిచేస్తుంది.
సోమిరెడ్డి హయాంలో శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప, ప్రారంభోత్సవ శిలాఫలకాలు ప్రారంభించలేకపోయాడు.
సోమిరెడ్డి తన హయాంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిధులు కేటాయించలేకపోయాడు.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, పనులు పూర్తిచేసి, ప్రారంభించాం.


గతంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ నిధులు మంజూరు చేయించి, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాం.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
ప్రభగిరిపట్నం దళితవాడకు వచ్చే రోడ్డు నిర్మించాలన్న గ్రామస్తుల కోరిక సుదీర్ఘకాలంగా, అపరిష్కృతంగా ఉన్నా, అధికార పార్టీ శాసనసభ్యునిగా నిధులు మంజూరు చేయించి, రోడ్డు నిర్మాణం పూర్తి చేయించి, గ్రామస్తులకు అందించడం అత్యంత సంతోషంగా ఉంది.


ప్రభగిరిపట్నం గ్రామంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యునిగా మట్టి రోడ్డు కనిపించకుండా, సిమెంటు రోడ్డు వేయించాం.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు..


SAKSHITHA NEWS