7వ రోజు పాదయాత్ర పూర్తిచేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలలో జిఎచ్ఎంసి అధికారులు మరియు స్థానిక వాసులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తైయ్యాయని అన్నారు. కాలనీలలో కొంతమేర పెండింగులో ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను తొందరలో పూర్తిచేస్తామని అన్నారు. పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి ఎటువంటి సమస్యలు ఉన్నా పాదయాత్రలో భాగంగా నోట్ చేసుకుని త్వరలో పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే పిజెఆర్ నగర్ కాలనీలో అమ్మవారి గుడి వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పార్కు అభివృద్ధి పనులు మొదలుపెడతామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మరియు అందించిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు జాన్, బాలస్వామి, ముజీబ్, మౌలానా, బాబునాయక్, రవీందర్, సాయిగౌడ్, పుట్టం దేవి, వెంకటలక్ష్మి, రేణుక, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page