శేరిలింగంపల్లి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Spread the love

సాక్షిత : భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్
శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రు నగర్, గోపినగర్ కాలనీలలో భూగర్భ డ్రైనేజ్ మరియు నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులలో నాణ్యతలోపం లేకుండా చూడాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఈఈ శ్రీనివాస్, ఎఈ సునీల్, యాదవ్ గౌడ్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపాల్ యాదవ్, దివాకర్ రెడ్డి, సత్యనారాయణ, రవీందర్, విక్రమ్, అరుణ, నరసింహ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page