నూతనంగా ఏర్పాటు చేసిన (“TAAZA FOODS “) తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

Spread the love

సాక్షిత : *శేరిలింగంపల్లి డివిజన్ లోగల గుల్మోహర్ పార్క్ నల్లగండ్ల ఎక్స్ రోడ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “TAAZA FOODS” తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

అనంతరం కార్పొరేటర్ పప్రదమంగా స్వహస్తాలతో కొనుగోలు చేసి, నిర్వాహకులను సంతోషపరిచారు. ఈ సందర్బంగా నిర్వాహకులు కార్పొరేటర్ కి పూలబొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ, స్వయం ఉపాధి మార్గం ఎంచుకొని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం అభినందనీయమని అన్నారు. ధరలు, నాణ్యత విషయంలో వినియోగదారుల నమ్మకాన్ని పెంచే విధంగా వ్యాపారం నిర్వహించి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులైన తండు నర్సింహా గౌడ్ కు కార్పొరేటర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో SI శ్రీధర్ యాదవ్, వెంకట్ రమణ, ZPTC తండు సైదులు గౌడ్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, రాజ్ కుమార్, పిల్లి యాదగిరి, నర్సింహా, తిరుమల చారీ, ప్రభాకర్, శ్యామ్ నిర్వహకుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page