క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని క్రైస్తవులకు బట్టల పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్

Spread the love

Corporator Ragam Nagender distributed clothes to Christians on the occasion of Christmas

క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని క్రైస్తవులకు బట్టల పంపిణీ చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్


సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లో గల పాపిరెడ్డి కాలనీలని బికెఎమ్ చర్చ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ శాఖ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్ డానియల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొనిన అనంతరం క్రైస్తవులకు బట్టల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముందుగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు, క్రైస్తవులంతా సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

ఇది మతసామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ శామ్యూల్ రాజు, జనరల్ సెక్రెటరీ డానియల్, ట్రెజరర్ ఎం.శ్యాంబాబు, గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, తదితర పాస్టర్ లు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page