ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

సాక్షిత హైదరాబాద్:
తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్ గెస్టుగా రేవంత్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రూ.2000 కోట్లలతో 64ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా డెవలప్ చేయబోతున్నట్లు చెప్పారు.

స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదిం పులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామన్నారు.

ఈ ప్రభుత్వం అంద రిదీ..మీరు కోరుకుంటేనే ఇక్కడికి వచ్చామని.. రాష్ట్రాభివృద్ధికి అందరి సహకాం అవసరమన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానమని అన్నారు.

పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం.
రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు

అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాల కులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తా మని చెప్పారు.

గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని… ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు…

Related Posts

You cannot copy content of this page