ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! రూట్స్ వివరాలివే.

Spread the love

ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌‌టీసీ.

సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు ప్రతిసారీ బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది! ఇలాంటి ఐడియాతోనే సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయి. అంటే ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేవాళ్లకు అనుకూలంగా ఉంటాయి. ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌‌టీసీ.

ఇందులో రకరకాల రూట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..
విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు , బాపట్ల సూర్యలంక బీచ్‌లను కవర్ చేస్తూ ప్రతిరోజూ విజయవాడ నుంచి సర్క్యూ్ట్ బస్సు బయలుదేరుతుంది. అలాగే విజయవాడ, గుంటూర, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ మీదుగా మరో టూర్ కూడా అందుబాటులో ఉంది.

శ్రీశైలం వెళ్లాలనుకునేవారికోసం హైదరాబాద్, కర్నూలు నుంచి పలు సర్క్యూట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కర్నూలు నుంచి అహోబిలం, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ తిరిగి కర్నూలు చేసుకునే బస్సు, కర్నూలు నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ కర్నూలు చేరుకునే బస్సు, కర్నూలు నుంచి మంత్రాలయం అప్ అండ్ డౌన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page