రూ. 2 కోట్ల 91లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు

Spread the love

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ,ఈనాడు కాలనీ, వివేకానంద నగర్ అపార్ట్మెంట్స్, మాధవరం కాలనీ,వెంకటేశ్వర నగర్ కాలనీలలో రూ. 2 కోట్ల 91లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసినప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా వివేకానంద నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్లు, బిటి రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

  1. వివేకానంద నగర్ కాలనీలలో రూ. 49.75 లక్షల రూపాయలతో అంచనా వ్యయంలో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు,

2.ఈనాడు కాలనీ లో రూ. 38.90 లక్షల రూపాయలతో అంచనా వ్యయంలో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

3.వివేకానంద నగర్ కాలనీ, వివేకానంద నగర్ అపార్ట్మెంట్స్ లో రూ. 41.61 లక్షల రూపాయలతో అంచనా వ్యయంలో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

4.మాధవరం కాలనీ,వెంకటేశ్వర నగర్,ఆల్విన్ కాలనీ ఫేస్1 కాలనీ లో రూ. 88.36 లక్షల రూపాయలతో అంచనా వ్యయంలో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

5.వెంకటేశ్వర నగర్, రామకృష్ణ నగర్,రిక్షాపుల్లర్స్ కాలనీ లో రూ. 72.42 లక్షల రూపాయలతో అంచనా వ్యయంలో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

పైన పేర్కొన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు ,నాయి నేని చంద్రకాంత్ రావు,రాంచందర్, హరినాథ్ ఆంజనేయులు, చంద్రమోహన్ సాగర్, ఎర్రలక్ష్మయ్య, అల్లం మహేష్, విద్యాసాగర్,శ్రీనివాస్ రెడ్డి,బాబు, రవి,శివసాగర్, సంపత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు మరియ, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page