రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం

Spread the love

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …


సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద క్యూసీసీఏ ఛైర్మన్, జీడిమెట్ల గ్రేస్ కాస్పల్ చర్చ్ పాస్టర్ శౌరి బోల్లేదు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ కు చెందిన పలువురు పాస్టర్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి ఈనెల 16వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు “గ్రేస్ గాస్పల్ చర్చ్ ఆవరణలో నిర్వహించే రక్తదాన శిబిరం” ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమని, రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా రక్తదానం చేసిన వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్ జాషువా, పాస్టర్ స్మిత్ బాబు, పాస్టర్ ధర్మ రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page