గోదావరి పుణ్య స్థానాలకు వచ్చిన భక్తులకు అల్పాహారం

Spread the love

Breakfast for devotees who come to holy places of Godavari

గోదావరి పుణ్య స్థానాలకు వచ్చిన భక్తులకు అల్పాహారం, చల్లని మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

సాక్షిత న్యూస్, మంథని ప్రతినిధి:

మంథనిలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం రోజు గోదావరి స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారం, మినరల్ వాటర్ ఉచిత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎఐసిసి కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హాజరై, భక్తులకు స్వయంగా అందజేశారు.

అనంతరం మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు మంథని నియోజకవర్గ, జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.

భక్తులకు ఇబ్బంది లేకుండా, పోలీస్ బలగాలను రప్పించి, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.

మహా శివరాత్రి సందర్భంగా మంథని నియోజక ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, మహా శివరాత్రి సందర్భంగా పార్వతి పరమేశ్వర ఆశీర్వాదాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page