శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి భూమి పూజ

Spread the love

Bhumi Puja to Sri Shirdi Sai Baba Temple

శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి భూమి పూజ

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని వి.ఎన్ పురం పంచాయతీ సూరాపురం గ్రామంలోని సాయి నగర్ కాలనీలో సాయి బాబా ఆలయానికి భూమిపూజ కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగింది.మురపాక సతీష్ శర్మ నేతృత్వంలో పూజలు నిర్వహించారు.శ్రీ శిరిడి సాయినాథ,సకల దేవతామూర్తుల ఆశీస్సులతో ఆలయ భూమిపూజ జరిపినట్లు సుగ్గు సత్తిబాబు,శ్రీ దేవి దంపతులు తెలిపారు.ఆలయ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని గ్రామ పెద్దలు, ప్రజలు పేర్కొన్నారు.సాయిబాబాను ప్రతిష్ఠించే ప్రదేశంలో విశేష పూజలు జరిపినట్లు సతీష్ శర్మ తెలిపారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు,పెద్దలు, పలువురు సాయి భక్తులు హాజరయ్యారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page