బీపీ మండల్ విగ్రహావిష్కరణ కి భూమి పూజ  నిర్వహించిన ఎమ్మెల్యే

బీపీ మండల్ విగ్రహావిష్కరణ కి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే

SAKSHITHA NEWS

Bhumi Puja program was organized by the MLA for the unveiling of the statue of BP Mandal

బీపీ మండల్ విగ్రహావిష్కరణ కి భూమి పూజ కార్యక్రమాము నిర్వహించిన ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీష


సాక్షిత తిరుపతి : బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గా తిరుపతి లో బీపీ మండల్ విగ్రహాన్ని అవిష్కరించడానికి వై.యస్.ఆర్ మర్గ్ సర్కిల్ నందు ఘనంగా భూమి పూజ కార్యక్రమాము నిర్వహించారు. తిరుపతి శ్యాసనసభ్యులు భూమన కారుణకర రెడ్డి చేతులు మీదుగా నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతిలో బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ కొరకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం బీసీలకు ఉన్నత స్థానం కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
మేయర్ శిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి బీసీలకు పెద్ద వేస్తున్నారని తెలిపారు. తిరుపతి శాసనసభ్యులు భూమన్ కరుణాకర్ రెడ్డి తిరుపతి నగరంలో బీసీలకు ఉన్నత పదవులు కల్పిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ ,50 డివిజన్లు కార్పొరేటర్లు మరియు టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి ,టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్ మరియు పార్టీ నాయకులు దొడ్డ రెడ్డి సిద్దారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. నిర్వహుకులు బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ ,ప్రధాన కార్యదర్శి అశోక్ సామ్రాట్ యాదవ్ ,అధికార ప్రతినిధి అక్కినపల్లి లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు సాకం ప్రభాకర్,బి.వి.కేశవులు, కార్యదర్శి కట్టమంచి చంద్రబాబు అనేక కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


అతిధిగా అఖిల భారత యాదవ మహాసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య పాల్గొన్నారు. నవంబర్ 27 తేదీ న విగ్రహావిష్కరణ జరుగుతుంది అని జిల్లా నలుమూలల నుండి బీసీ నాయకులు పాల్గొంటారని ఈ సందర్భంగా బీసీ నాయకులు తెలియజేశారు.


SAKSHITHA NEWS