భారతీయ జనతా పార్టీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Spread the love

భారతీయ జనతా పార్టీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రకాశం జిల్లా కొమరోలులో భారతీయ జనతా పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గిద్దలూరు అసెంబ్లీ కన్వీనర్ మంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్,భారతీయ జనతా పార్టీ నాయకులు పాతకోట బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. నరేంద్ర మోడీ సారధ్యంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని మునుముందు ఇంకా సాధిస్తూనే ఉంటుందని అసెంబ్లీ కన్వీనర్ మంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్ అన్నారు.

అలానే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్న మేమున్నం సేవా సమితి అధ్యక్షుడు చల్ల అశోక రెడ్డిని, విలేజ్ ఫోర్స్ అధ్యక్షుడు శశి కుమార్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ నాయకులు సన్మానించారు. మేమున్నాం సేవా సమితి చేస్తున్న రక్తదాన కార్యక్రమాలను విలేజ్ ఫోర్స్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చేస్తున్న కృషిని వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో డి. నాగయ్య, కె. చంద్రశేఖర్,వేణు, నారాయణా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page