హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒకప్పుడు మురికి కూపం లాగా ఉన్న అలీ తలబ్ చెరువు కు మహర్దశ వచ్చినది అని, ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ సహకారంతో చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినది అని, అదేవిధంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరీకరణ పనులు చేపడుతున్నాం అని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులు ప్రణాళిక తో, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ నరేందర్, ఏఈ విశ్వం, వర్క్ ఇన్స్పెక్టర్లు మహాదేవ్, రతన్ కాలనీ వాసులు నక్క శ్రీనివాస్, అష్రాఫ్, సత్యనారాయణ, చాట్ల రవి, నక్క సురేష్, చంద్రయ్య, కృష్ణారెడ్డి, ఎల్లస్వామి, నరేందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, అంజిరెడ్డి, బ్రహ్మయ్య, శ్రీశైలం, శ్రీనివాస్, సత్తార్, ఖలీమ్, హబీబ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page