బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య విలేఖరులతో సమావేశం

Spread the love

బాపట్ల లోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వున్న పార్క్ వద్ద బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య విలేఖరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుపుతీగలాగా రాజకీయాలు నడుపుతున్న బీజేపీ,చంద్రబాబు ల దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పేదప్రజలకు అండగా వుంటూ సంక్షేమ పధకాలను అందిస్తున్న సిఎం జగనన్న పై విమర్శలు చేస్తుంటే మా వైసీపీ నాయకులు మిమ్మల్ని పొగడమంటారా అని సూటిగా ప్రశ్నించారు.బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారంతో మరియు సిఎం జగనన్న ఆదేశాలిస్తే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ మీద ఎమ్మెల్యే గా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయటానికి నేను రెడీ అని చల్లా రామయ్య ఛాలెంజ్ చేశారు.

బాపట్ల లో వున్న జనసైనికుడు నాపై పోటీ చేస్తాను అంటున్నాడు.. నీకు నా మీద పోటీ చేసే స్థాయి కాదని మీ జనసేన పార్టీ లో కనీసం పదవి హోదా కూడా లేదని విమర్శించారు.ఎప్పుడూ ప్రజల్లో వుండి ప్రజల కోసం సేవలు చేసేవాడే నాయకుడు అవుతాడు గానీ కులంతోనో డబ్బుతోనో వచ్చేది స్థాయి కాదనే సంగతి ముందు తెలుసుకోమని మాట్లాడారు.పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు.బాపట్ల లోని జనసేన నాయకులు మరోసారి జగనన్న ను విమర్శలు చేస్తూ పిచ్చివాగుడు వాగితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పులి నారాయణ, మద్దిబోయిన శ్రీనివాసరావు, కొండమ్మ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page