క్రిస్టియన్ మైనార్టీ సెల్ కృష్ణాజిల్లా కమిటీ నియామకం.

Spread the love

గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా కమిటీలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన పలువురిని భర్తీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షులు పి. జయరాజు ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొమరవెల్లి కిరణ్ మూర్తి (బాపులపాడు), జిల్లా కార్యదర్శిగా దావులూరు కరుణాకర్ (గన్నవరం), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బొకినాల శామ్యూల్ (వేంపాడు), బొడ్డు బాబురావు (గొల్లనపల్లి)లను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.

క్రిస్టియన్ మైనార్టీ సెల్ గన్నవరం నియోజకవర్గ కమిటీ నియామకం ఉత్తర్వులు

క్రిస్టియన్ మైనార్టీ సెల్ గన్నవరం నియోజకవర్గ కమిటీని భర్తీ చేసినట్లు జయరాజు ప్రకటించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేశామని జిల్లా అధ్యక్షులు పి. జయరాజు పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతి కోసం గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ చేస్తున్న కృషి అందరికీ తెలుసునని పేర్కొన్నారు.

క్రిస్టియన్ మైనార్టీ సెల్ గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులుగా గన్నవరం మండలం కేసరపల్లి కి చెందిన నీలం సురేష్ రావును నియమించారు. కేసరపల్లి శివారు వి.ఎన్.పురం కాలనీకి చెందిన వడ్లమూడి రాజును గన్నవరం మండల ప్రెసిడెంట్ గా నియమించారు. ఉంగుటూరు గ్రామానికి చెందిన పాస్టర్ బొకినాల ఇస్సాకును ఉంగుటూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమించారు.

ఓగిరాలకు చెందిన బేతపూడి బాబును బాపులపాడు మండల క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు పేర్కొన్నారు. వీరందరూ గన్నవరం నియోజకవర్గంలో, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతి తో పాటు వైఎస్ఆర్సిపిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అనునిత్యం పాటుపడతారని పేర్కొన్నారు. వీరు సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే వంశీ అడుగుజాడల్లో ముందుకు సాగుతారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page