ప్రభుత్వ విప్ గాంధీ నివాసంలో అంబరాన్ని అంటిన సంబరాలు

Spread the love

బాణా సంచా కాల్చి ,స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

సర్వమత ప్రార్ధనలతో ఆశీర్వాదాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని ప్రకటించిన శుభసందర్భంగా శేరిలింగంపల్లి ప్రైవేట్ పాఠశాలల యజమానులు యునైటెడ్ స్కూల్ అధినేత లయన్ డా.బొరుసు వెంకటేశ్వర రావు,రాజేశ్వరరావు,నరేంద్రబాబు, నిజాం అలీఖాన్ ,అస్లాం,సుజీవన్ నోవా, గణేష్, నానిబాబు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.

నా పై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మళ్ళీ నన్ను ప్రకటించిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు

రాష్టంలో మళ్ళీ బీర్ఎస్ పార్టీ దే హైట్రిక్ విజయం .

శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నా పై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మళ్ళీ నన్ను ప్రకటించిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని , ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నా తరుపున మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యత తో రెట్టింపు ఉత్సహం తో పనిచేసి ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామి గా నిలబెట్టడానికి నా వంతు శయాషెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు.

నా వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు , వార్డ్ మెంబర్లకు,ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు , కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు నా హృదయపూర్వక ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. మీ అందరి ఆశీస్సుల తో , మీ సహాయ సహకరాలతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారం తో 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని,మీ అందరి ఆశీస్సులతో, సహకారంతో రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో గెలిచి మీ అందరి ఆశీస్సులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మరింత అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు

ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని,ముఖ్య మంత్రికెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని , ఆసరా పింఛన్లు ,ఒంటరిమహిళా పింఛన్లు,కెసిఆర్ కిట్,కంటి వెలుగు ,రైతు బంధు ,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్పసంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రికేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు ,హైదరాబాద్ ను విశ్వనగరం గా తీర్చి దిద్దే క్రమంలో భాగంగా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుటకు మౌలిక వసతుల కల్పనకై ముఖ్య మంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచనల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో IT రంగం , అతి పెద్ద భవనాలు, అత్యధిక ప్రజానీకం నివాసిస్తున్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన పరిస్థితుల్లో ముఖ్య మంత్రి KCR దూర దృష్టితో మరియుమంత్రి KTR ప్రణాళికలతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి SRDP ప్రాజెక్ట్ ద్వారా సాఫీగా ప్రయాణాలు సాగె విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యం తో SRDP ప్రాజెక్ట్ లో భాగంగా తొలి ఫలితం అయిన అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించడం జరిగినది అని, SRDP లో 10 పనులకు గాను 9 పనులు పూర్తి అయినవి అని, మరొకటి పురోగతిలో ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ప్రత్యమ్నాయ రోడ్లు ,ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు కొత్త ప్రతిపాదనల తో బ్రహ్మాండంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోకూడా అధికారులు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని,ఎక్కడ పనులు ఆపకుండా ఎన్నో స్థల సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రజల సహకారం తీసుకోని అధికారులను సమన్వయ పర్చుకుంటూ ఇన్ని రోడ్లు అభివృద్ధి చేయడం అంటే బహుశా 50 యేండ్ల చరిత్రలో ఇది మొట్టమొదటి సరిగా గొప్ప చరిత్ర అని చెప్పుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ,మాకు చాలా గౌరవంగా ఉందని చెప్పడానికి చాల సంతోషిస్తున్నాను అని ,అదేవిధంగా బ్రహ్మాండంగా ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు, కొత్త రోడ్లు వేయడం జరిగినది .చాల సంతోషంగా ఉంది అని , ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి KTR కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు..

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page