వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య

Spread the love

మోటకొండూర్ మండలంలో మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లంల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నాంచారి పేట, కదిరేణి గూడెం,గ్రామల్లో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతంలో భాగంగా కొండాపూర్ గ్రామంలో నూతన గ్రామ శాఖ కమిటీని ఎన్నుకోవడం జరిగింది

ఈ సందర్భంగా వాటర్ క్యాన్లు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన బీర్ల ఐలయ్య కి గ్రామస్తులు శాలువాతో సన్మానించి కోలాటాలతో డప్పు చప్పుల్లతో పెద్దఎత్తున్న ఘన స్వాగతం పలికారు..

ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.భావి ప్రధాని రాహుల్ గాంధీ రైతుల కోసం రైతు డిక్లరేషన్ చేయడం జరిగిందని.దీని ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.అదే విధంగా హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ యువతకు యువ డిక్లరేషన్ చేయడం జరిగిందని ఈ యువ డిక్లరేషన్ వల్ల యువకులకు పెద్దపీటవేయునట్లు తెలిపారు.అదే విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే గ్రామాల్లో ఉందని,ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని,ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ సీఎంను గద్దె దింపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిరిబోయిన మల్లేష్ యాదవ్,మాజీ జెడ్పిటిసి గంగాపురం మల్లేష్,మాజీ ఎంపీపీ వీసం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు మదర్ గౌడ్, చాడ శశిధర్ రెడ్డి, ఏనుగంటి శర్మ, పి ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ జహంగీర్ విట్టల్ రెడ్డి, మల్లారెడ్డి, OBC సెల్ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య గౌడ్, రేగు చంద్రశేఖర్, తండ రంగయ్య, ఉప సర్పంచులు. ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్, క్యాసగళ్ల చందు, అజయ్ ,శ్రీకాంత్, ప్రకాష్ రెడ్డి , NSUI నాయకులు రేగు రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page