అడ్వకేట్ లక్ష్మణ శర్మ. జ్యోతి.దంపతుల తరఫున ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మ

Spread the love

Advocate Laxmana Sharma. Jyoti. On behalf of the couple, to the students of the government college

అడ్వకేట్ లక్ష్మణ శర్మ. జ్యోతి.దంపతుల తరఫున ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మెడికల్ కిట్స్ పంపిణీ

సాక్షిత ప్రతినిధి.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కీ.శే కామేశ్వర సాయి ప్రసాద్ వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు.

ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్వకేట్ లక్ష్మణ శర్మ, అడ్వకేట్ జ్యోతి, హై స్కూల్ హెచ్ఎం సిద్ధార్థ హాజరైనారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వివిధ గ్రూప్ ల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించిన విద్యార్థులకు సాయిప్రసాద్ పేరుతో బహుమతులు ప్రధానం చేస్తామని శర్మ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించు వారికి అండగా ఉండే విధంగా ఎల్లవేళలా కృషి చేస్తామని అడ్వకేట్ శర్మ పేర్కొన్నారు .అనంతరం అడ్వకేట్ శర్మ జ్యోతి ,ప్రిన్సిపాల్ సురెంధర్ రెడ్డి ,లెక్చరర్ సదానందం గౌడుల కు శాలువాతో సన్మానించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వేణుసార్ మహిళ సంఘం సభ్యులు రాజేశ్వరి, రేష్మ ,కోమ్ముతిరుపతి,అధ్యాపకులు సదానందం గౌడ్, రాముడు, నయీమ్, రమకాంత్,పరుశురాం ,మల్లికార్జున్ ,బాలరాజ్ భీమేష్ శ్రీనివాస్, లక్ష్మణ్, సంతోష్ గౌడ్, బాలయ్య, గిరిబాబు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page