ఓబిఎస్ డిగ్రీ కళాశాలకు అకాడమిక్ ఎక్స్ లెన్స్ అవార్డు

Spread the love

ఉప్పల్ : ఉప్పల్ పరిధి హబ్సిగూడ లోని (ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ డిగ్రీ కళాశాలకు 2022 – 2023 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ జి కృష్ణ కవిత ప్రకటనలో తెలిపారు. ఎడ్యు రిపబ్లిక్ సీఈవో ఎస్ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణ కవిత మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కళాశాల యొక్క అంకితభావాన్ని ప్రదర్శించే పాఠ్య ప్రణాళిక వెలుపల సర్టిఫికేషన్ కోర్సులను అందించడంలో అత్యుత్తమ సాధనకు అవార్డు లభించదని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ నాగ మోహన్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ కసిరెడ్డి మాలతి రెడ్డి.. ప్రిన్సిపాల్ కృష్ణ కవితను అభినందించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు రవిశంకర్, తేజస్వి పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 14 At 7.25.50 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page