రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

Spread the love

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు చెందిన దూదేకుల ఖాదర్ వలీగా పోలీసులు గుర్తించారు. మొదట తీవ్రంగా గాయపడ్డ దూదేకుల ఖాదర్ వలిని కుటుంబ సభ్యులు గిద్దలూరు లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.కానీ అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వెల్లడించారు.

Related Posts

You cannot copy content of this page