కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…

Spread the love

కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ ఇండస్ట్రీలో ఎలక్ట్రీషన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా 24 జూలై 2022న ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రత్యేక చొరవ చూపి సదరు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి రూ.9 లక్షల నష్ట పరిహారం అందిచేలా యాజమాన్యాన్ని ఒప్పించారు. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే తన నివాసం వద్ద కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుమోహన్, మునీర్, సాజిద్, అన్ను, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page