రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కు

Spread the love

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కును అందజేసిన బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపల్ పరిధి మల్లంపేట్ కు చెందిన దూసకంటి కవిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పేద కుటుంబం కావడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ మరియు కౌన్సిలర్ అనంత స్వామి ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యంతో చర్చించి కవిత భర్త దూసకంటి రమేష్ కు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఒప్పించారు. ఏమేరకు రమేష్ కు రూ.1.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ జీతయ్య, వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, 24,25 వార్డు ప్రెసిడెంట్లు రమేష్, లక్ష్మణ్, మాజీ వార్డు మెంబర్ నరసింహ, నాయకులు ఉట్ల శ్రీహరి, ఆకుల అశోక్, శ్రీశైలం, కొటేష్, తదితరులు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page