హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణి

Spread the love

వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మెట్టుగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలొ హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హరివిల్లు ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కష్ట పడి చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు,తీసుకురావాలన్నారు.


దేశ భవిష్యత్‌ విద్యార్థులపై ఆధార పడి ఉందన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలొ చదువుతున్న విద్యార్థులకు హరివిల్లు ఫౌండేషన్ చేస్తున్నా సేవలు అభినందనీయం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమలు మరిన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలొ హరివిల్లు ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు రాకేష్ ,గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page