SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఆదివారం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి మరియు శంకర గుంటూరు కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు.అనంతరం కంటి ఆపరేషన్ అవసరమున్నవారిని మూడు బస్సులలో 150 మందికి పైగా గుంటూరుకు తరలించారు. కంటి ఆపరేషన్ అవసరమున్నవారిని గుంటూరుకు పంపేందుకు వైసిపి నాయకులు రమణారెడ్డి స్వయంగా దగ్గరుండి మరి బస్సులలో వారిని ఆపరేషన్ కు పంపారు.ఆపరేషన్ అనంతరం రోగులను తిరిగి సురక్షితంగా గిద్దలూరు కు చేర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కామూరి రమణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS