అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత.

Spread the love

విజయవాడ:అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..
తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్‌ అధికారులు విజయవాడ రైల్వేస్టేసన్ వద్ద నిఘాపెట్టారు..
ఈ తరుణంలో దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు.
తొలుత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అదుపులో ఉన్న వారు ఇచ్చిన సమాచారంతో మరి కొందరిని అదుపులోకి తీసుకుని 7.97 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో మరికొంత ఆభరణాల రూపంలోను ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page