SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా నిజాంపేట్ కార్పొరేషన్ లో ఎమ్మెల్యే పర్యటన…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ప్రగతి నగర్ ఐడిపిఎల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, శ్రీ విజయ దుర్గనగర్, సాయికృష్ణ ఎంక్లేవ్ కాలనీలలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , కార్పొరేటర్ చిట్ల దివాకర్ తో కలిసి పాదయాత్ర చేశారు. కాలనీలో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాంపేట్ ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఆయా పనులు చక్కటి ఫలితాలు ఇవ్వనున్నాయని అన్నారు. త్వరలోనే తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎన్ఎంసీ పార్టీ అధ్యక్షులు, నాయకుల, కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS